సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నేటి ఉదయం 9.30 గంటలకు పలాస(శ్రీకాకుళం)లో, 11.30 గంటలకు పాడేరు(విశాఖపట్నం)లో, మధ్యాహ్నం 2 గంటలకు పిఠాపురం(తూర్పుగోదావరి)లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.