కరువుతో రాయలసీమ అల్లాడుతోంది
చంద్రబాబు ఒక దళారి.. ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా?
నెమళ్లగుంటవల్లిలో రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి..
నెమళ్లగుంటపల్లి (చిత్తూరు జిల్లా): చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారని, చంద్రబాబే దళారిగా మారి.. రైతులను దళారులకు అమ్మేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదని, రైతులు బాబు పాలనలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని, చంద్రబాబు సీఎం కావడంతో ఆయనతోపాటు కరువు కూడా వచ్చిందని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా నెమళ్లగుంటపల్లిలో గురువారం వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. దేవుడి దయతో రేప్పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేయడానికి ప్రత్యేక పథకాలు అమలుచేస్తామని, ప్రతి ఒక్క రైతు కుటుంబంలోనూ ఆనందాన్ని నింపుతామని వైఎస్ జగన్ తెలిపారు. మన పాలనలో అనుసరించాల్సిన విధానాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులను కోరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ క్లుప్తంగా ప్రసంగించారు.. ఆయన ఏమన్నారంటే.
మన ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్నివిధాలుగా ఆదుకుంటాం