301వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

18 Nov, 2018 21:09 IST|Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 301వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం జననేత కురుపమ్‌ నియోజకవర్గంలోని తోటపల్లి క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి నందివాని వలస, గిజబ, దత్తివలస మీదుగా గవరంపేట, పెదమేరంగి క్రాస్‌, సీమనాయుడు వలస వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు