అన్న వస్తున్నాడు..

6 Apr, 2019 12:41 IST|Sakshi

రేపు అనకాపల్లి, గాజువాకలకు వైఎస్‌ జగన్‌

ఐదో విడత ప్రచారానికి శ్రీకారం

విశాఖసిటీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన జిల్లాకు రానున్నారు. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన జననేత ఆ తర్వాత పాడేరు, పాయకరావుపేటలో పర్యటించారు. ఐదో విడతగా జిల్లాలో అడుగు పెడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం 11.30 గంటలకు అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ తరపున జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి.. సాయంత్రం 4 గంటలకు తిరిగి విశాఖ చేరుకుంటారు. గాజువాక నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

మరిన్ని వార్తలు