233వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

9 Aug, 2018 20:29 IST|Sakshi

సాక్షి, పత్తిపాడు/తూర్పు గోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ​ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 233వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. నేడు వైఎస్‌ జగన్‌ 6.2 కిలోమీటర్లు నడిచారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. గురువారం ఉదయం పత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం డీజేపురం నైట్‌క్యాంపు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం పారుపాక క్రాస్‌ మీదుగా డీజేపురం వరకు పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు ఆయన మొత్తం 2,691.2 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు