రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

20 Jul, 2018 21:01 IST|Sakshi

సాక్షి, కాకినాడ : లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ట్వీటర్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై రేపు ఉదయం ప్రెస్‌మీట్‌లో స్పందిస్తానని వైఎస్‌ జగన్‌ చెప్పారు. కాకినాడ జేఎన్టీయూకు ఎదురుగా ఉన్న పాదయాత్ర శిబిరంలో ప్రెస్‌మీట్‌ ఉంటుందని వైఎస్సార్‌సీపీ మీడియా సెల్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు