126వరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

1 Apr, 2018 18:44 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ, ప్రభుత్వం అసమర్థతను ఎండగడుతూ  ప్రతిపక్షనేత, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు అడుగడుగునా తమ బాధలను ఆయనతో చెప్పుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారందరికీ తగిన భరోసా ఇస్తూ భవిష్యత్తుపై నమ్మకం కలిగిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. 

ఈ మేరకు వైఎస్‌ జగన్‌ 126వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూలు ఖరారు అయింది. సోమవారం ఉదయం పేరిచర్ల శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు శ్రీనివాస కాలనీ చేరుకోవడంతో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర తాడికొండ నియోజకవర్గం పూర్తి చేసుకొని ప్రత్తిపాడు నియోజకవర్గంలో అడుగు పెడతారు. అనంతరం వెంగలాయ పాలెం క్రాస్‌, చల్లవారిపాలెం, మీదుగా నల్లపాడు చేరుకుంటారు. అక్కడ లంచ్‌ విరామం తీసుకుంటారు. 

భోజనం విరామం అనంతరం మద్యాహ‍్నం 2:45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. తిరుపతిరెడ్డి నగర్‌ చేరుకోవడంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ ప్రవేశిస్తారు. అక్కడ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ, మల్లారెడ్డి నగర్‌ మీదుగా శ్రీరామ్ నగర్‌ చేరుకుంటారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు