247వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

26 Aug, 2018 17:41 IST|Sakshi

సాక్షి, యలమంచిలి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 247వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం జననేత అచ్యుతాపురం నైట్‌ క్యాంప్‌ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం మండలంలోని అప్పన్న పాలెం, మదుటూరు జంక్షన్‌, సానికాలువ, చీమలపల్లి మీదుగా పాదయాత్ర సాగుతుంది.

తర్వాత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. బంగారం పల్లి క్రాస్‌ మీదుగా కొండకర్ల, కొండకర్ల జంక్షన్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
 

మరిన్ని వార్తలు