ఈతేరు శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం
పొన్నూరు బహిరంగ సభలో ప్రసంగించనున్న జననేత
సాక్షి, గుంటూరు : ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 112వ రోజు షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం మీడియాకు విడుదల చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం బాపట్ల నియోజకవర్గం ఈతేరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చుండూర్పల్లి మీదుగా ములకుదురు చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం మాచవరం క్రాస్ రోడ్డు మీదుగా చింతలపూడి చేరుకొని పార్టీ జెండాను ఎగురవేస్తారు.11 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి పొన్నూరు ఐస్లాండ్ సెంటర్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు పాదయాత్రను ముగిస్తారు.
111వ రోజు ముగిసిన పాదయాత్ర
జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 111వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. నేడు 12.3 కిలోమీటర్లు నడిచిన ఆయన మెత్తం 1496.5 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. బాపట్ల మూర్తి రక్షణ నగరం, కొండుబొట్లవారిపాలెం క్రాస్ రొడ్డు, అప్పికట్ల, పూండ్ల క్రాస్ రోడ్డ మీదుగా ఈతేరు వరకు నేటి పాదయాత్ర కొనసాగింది.