ప్రజాసంకల్పయాత్ర 130వ రోజు షెడ్యూల్‌

6 Apr, 2018 18:39 IST|Sakshi

సాక్షి, తెనాలి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు అడుగడుగునా తమ సమస్యలను రాజన్న బిడ్డకు ఏకరవు పెడుతున్నారు. వారందరికీ జననేత వైఎస్‌ జగన్‌ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా 130వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం ఉదయం ఆయన శేకుర్‌ గ్రామ శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి సంగం జాగర్లమూడి మీదుగా అంగల కుదురు చేరుకుంటారు. అనంతరం లంచ్‌ బ్రేక్‌ తీసుకుంటారు. 

భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రాంభమౌతుంది. సుల్తానాబాద్‌ మీదుగా తెనాలి పురవేదిక సెంటర్‌ చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు