సాక్షి, దెందులూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమ గోదావరిలో జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం వైఎస్ జగన్ దెందులూరు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి జోగన్న పాలెం, అప్పారావ్ పాలెం శివారు, శ్రీరామవరం, భైగానిపేట, మెడినరావు పాలెం మీదుగా రామారవు గూడెం చేరుకుని రాజన్న బిడ్డ భోజన విరామం తీసుకుంటారు.
పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి చల్లా చింతలపూడి, పెరుగు గూడెం చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ ఇక్కడే బస చేస్తారు. అడగడుగునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజాసమస్యలు తెలసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.