194వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర షెడ్యూల్‌

19 Jun, 2018 19:19 IST|Sakshi

సాక్షి, పి.గన్నవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 194వ రోజు షెడ్యూలు ఖరారైంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం నాగుల్లంక శివారు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాదయాత్ర చాకలి పాలెం, తాటిపాక మఠం మీదుగా పొదలాడు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.

పాదయాత్ర  తిరిగి మధ్యాహ్నం 2.45కు ప్రారంభమౌతుంది. అనంతరం పాదయాత్ర రాజోలు వరకు కొనసాగుతుంది. రాజోలులో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి  ప్రసంగిస్తారు. జననేత రాత్రికి ఇక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. జననేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

ముగిసిన పాదయాత్ర: రాజన్న బిడ్డ 193వ రోజు ప్రజాసంకల్పయాత్రను మంగళవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా జననేత  ఇవాళ 10 కిలోమీటర్లు నడిచారు. వైఎస్‌ జగన్‌ ఇప్పటి వరకు ప్రజాసంకల్పయాత్రలో 2,389.1 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు