225వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

30 Jul, 2018 21:01 IST|Sakshi

సాక్షి, పిఠాపురం (తూర్పుగోదావరి) :  అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 225వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత మంగళవారం ఉదయం పిఠాపురం మండలం విరావ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు.

లంచ్‌ బ్రేక్‌ అనంతరం మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి కుమారపురం, పిఠాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ​

ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 224వ రోజు ముగిసింది. సోమవారం ఉదయం కిర్లంపూడి మండలం రామచంద్రాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వీరవరం, రాజుపాలెం, పిఠాపురం మండలం చంద్రమాంపల్లి, దివిలి, విరావ వరకు నేటి పాదయాత్ర కొనసాగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.    

మరిన్ని వార్తలు