నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన ఇలా..

7 Apr, 2019 02:55 IST|Sakshi

కోరుకొండ, అనకాపల్లి, టెక్కలి, గాజువాక ప్రచార సభల్లో పాల్గొననున్న ప్రతిపక్ష నేత 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో, ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో, మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో, సాయంత్రం 4 గంటలకు విశాఖ జిల్లా గాజువాకలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు

మరిన్ని వార్తలు