అబ్దుల్‌ కలాంకు వైఎస్‌ జగన్‌ నివాళులు

15 Oct, 2018 15:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, ప్రఖ్యాత శాస్త్రవేత్త, దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఎన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ.. నిరాడంబరత్వానికి ఆయన ప్రతీక అని ఈ సందర్భంగా కొనియాడారు. అబ్దుల్‌ కలాం సదా స్ఫూర్తిదాయకమని, ప్రపంచ సృజనాత్మక కేంద్రంగా భారత్‌ వర్ధిల్లాలన్న కలాం స్వప్నం నిజం కావాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

>
మరిన్ని వార్తలు