14న ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

13 Jun, 2019 04:46 IST|Sakshi

15న జరిగే పార్టీ సమావేశంలో పాల్గొననున్న సీఎం 

పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ 

సాక్షి, అమరావతి :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో 15వ తేదీ ఉదయం 10 గంటలకు నంబర్‌ 1, జన్‌పథ్‌లో జరిగే వైఎస్సార్‌సీపీ సమావేశంలో ఆయన పాల్గొంటారు.

ఈ నెల 17వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనతో పాటుగా, విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రానికి సంబంధించిన అనేక ఇతర సమస్యల పట్ల పార్లమెంటు ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్‌ జగన్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారని తెలిసింది. పార్టీకి చెందిన 22 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులు విధిగా 15వ తేదీన సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందని వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు