55వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

6 Jan, 2018 19:53 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 55వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. జిల్లాలోని చంద్రగిరి నియోజక వర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. ఆదివారం ఉదయం పూడిబట్లబయలు గ్రామంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, పార్టీ జెండాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గుండ్లగుట్లపల్లి మీదుగా దామల చెరువు చేరుకొని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.

విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు​పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. పూతలపట్టు నియోజక వర్గంలోకి వైఎస్‌ జగన్‌ ప్రవేశిస్తారు. అనంతరం గొట్టాల క్రాస్‌ రోడ్డు మీదుగా గుండ్లపల్లి చేరుకొని వైఎస్‌ఆర్‌ విగ్రహం, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తరువాత సవటపల్లి, పొలకల సంత గేట్‌, పాటూరు మీదుగా చౌడుపల్లిక్రాస్‌రోడ్డు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 6గంటలకు మొరవ పాటూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం సాయంత్రం విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 54రోజు ప్రజాసంకల్పయాత్రను కల్లూరు వద్ద ముగించారు. ఇవాళ ఆయన 11.7 కిలోమీటర్లు నడిచారు. గొడ్లవారిపల్లి, శ్రీనివాసాపురం చల్లావారిపల్లి మీదుగా పాదయాత్ర సాగింది.

మరిన్ని వార్తలు