రేపు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం సమావేశం

25 Oct, 2017 19:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం సమావేశం ఈ నెల 26న జరుగనుంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా... వద్దా ? అనే అంశంపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు