బాబు నిజ స్వరూపాన్ని బయటపెడతాం

9 Jan, 2019 02:13 IST|Sakshi
మంగళవారం ఢిల్లీలో ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి, సుబ్బారెడ్డి, వరప్రసాద్‌

‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఎంపీలందరికీ ఇస్తాం

ఢిల్లీలో పుస్తకం విడుదల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో ప్రతిపక్ష పార్టీలతో కూటమి ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్న అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబు నిజస్వరూపాన్ని జాతీయ స్థాయిలో ఎండగడతామని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లలో చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అవినీతి, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి’ ఆంగ్ల పుస్తకాన్ని మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు.

బాబు అవినీతిని జాతీయ స్థాయి నేతలకు, ఎంపీలకు తెలియజెప్పేలా ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఇస్తామని, అలాగే దర్యాప్తు సంస్థలకు అందజేసి విచారణ కోరతామన్నారు. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు