ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: వైఎస్సార్‌సీపీ

11 Nov, 2018 02:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పార్టీ దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల మీదే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన పరి ణామాలను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, అదే సమయంలో 2024 ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని ప్రకటనలో వివరించింది. 

మరిన్ని వార్తలు