విజయవాడ ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

13 Mar, 2020 16:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చియారు. శుక్రవారం విజయవాడ ఆర్వో కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద  ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తమపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు