అందుకే నా భార్యతో నామినేషన్‌ వేయిస్తా : గోరంట్ల

24 Mar, 2019 12:36 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హిందూపురం లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. మూడు నెలల కిందట పోలీసు ఉద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చినా ఆమోదించడంలేదని మండిపడ్డారు. ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్ రావు, కర్నూలు డీఐజీ చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తున్నారన్నారు. హిందూపురంలో గెలుస్తానని భావించే తనపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రేపు(సోమవారం) హిందూపురం లోక్‌సభ స్థానానికి తాను, తన భార్య ఇద్దరం కలిసి నామినేషన్‌ వేస్తామని చెప్పారు. తన నామినేషన్‌ ఆమోందిచకపోతే తన భార్య పోటీ చేస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

పోలీస్‌ అధికారుల తీరు సిగ్గుచేటు

మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల

మాధవ్‌ రిలీవ్‌పై డీజీపీకి ఈసీ లేఖ

మరిన్ని వార్తలు