చంద్రబాబు రాజకీయ వ్యభిచారి : కారుమూరి నాగేశ్వరరావు

19 Jan, 2019 16:08 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం  ఏ పార్టీతో అయినా కలిసిపోయే రాజకీయ పచ్చి వ్యభిచారని వైఎస్సార్‌సీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు   బాబుపై  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం ద్వారకా తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఈ రోజు ఒకటి మాట్లాడితే రేపు ఒకటి మాట్లాడుతున్నాడని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా పోతోందని ఆయన  వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా కోసం వైఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తుంటే దానిని జగన్ కేసీఆర్ కలిసి పోటీ చేసే అంత ఇదిగా అల్లరి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి సుహాసిని పై గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ద్వారకా తిరుమల వస్తే ఆయనకి మీ పార్టీ జిల్లా కార్యదర్శి స్వాగతం పలకడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. కేసీఆర్‌ని తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని మీరు అడిగితే ఆయన  ఛీ ఛీ అంటూ మిమ్మల్ని ఛీ కొట్టారని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు