‘భారీ గెలుపు ఖాయమనిపిస్తోంది’

22 Mar, 2019 17:28 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : తనతో పాటు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలివచ్చిన ప్రజాభిమానాన్ని చూస్తుంటే పాలకొల్లులో భారీ గెలుపు ఖాయమనిపిస్తోందని పాలకొల్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణ( బాబ్జి) సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం పాలకొల్లు వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా డాక్టర్ సీఎచ్ సత్యనారాయణ మూర్తి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు అర్ధం చేసుకుని వాళ్లకు కావలసిన సదుపాయాలు కల్పించడానికే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పాలకొల్లులో శాంతి భద్రతలు కాపాడటానికి, ప్రజలకు న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో మహిళలు, ప్రజలు నామినేషన్‌ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పార్టీ మీద అభిమానంతో డాక్టర్ బాబ్జి మీద అభిమానంతో ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. నియోజకవర్గంలో డాక్టర్ బాబ్జి 20వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు