బాబు సర్కార్‌ పతనం ప్రారంభమైంది

14 Apr, 2018 18:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్‌ మండిపడ్డారు. చిట్టినగర్‌లో జరుగుతున్న వైఎస్‌ జగన్‌ బహిరంగ సభకు పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌కు పతనం ప్రారంభమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌​ఆర్‌సీపీదే విజయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే వైఎస్సార్‌ పార్టీ నుంచి నీ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎవరి సత్తా ఎంటో తేల్చుకుందామని జోగి రమేష్‌ సవాల్‌​ విసిరారు. ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన వ్యక్తులు ఇప్పడు మా జెండాలను తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన 150 సీట్లకు పైగా గెలుస్తామని  జోగి రమేష్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు