సాక్షి,తాడేపల్లిగూడెం: ప్రజలంతా నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుంటే పాలకులు విదేశీ పర్యటనలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ నేత, తాడేపల్లి నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ విమర్శించారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రం అంతా అవినీతిమయం అయిందని ఆరోపించారు. తాడేపల్లి మున్సిపాలిటీ అధికారులంతా యథేచ్చగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
మండల తహశీల్దార్ తెలుగుదేశం కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం దొంగల మాయ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. టీటీపీ నాయకుల దుశ్చర్యలు తిప్పికొట్టి వైఎస్సార్సీపీ విజయంలో కీలక పాత్ర వహించాలని కార్యకర్తలకు సూచించారు.