ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మల్లిస్తున్నారు : మెరుగు

24 Jan, 2019 17:24 IST|Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయితేనే దళితులకు న్యాయం జరుగుతుందంటూ వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ మెరుగు నాగార్జున స్పష్టం చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో దళితులకు రక్షణ కరువయ్యిందన్నారు. దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన నిందితులపై ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ పాలనలో ఒక్క బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌ కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మల్లిస్తున్నారంటూ మండి పడ్డారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తేనే దళితుల హక్కుల రక్షింపబడతాయని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు