అందుకే బాబు హైదరాబాద్‌ పారిపోయాడు: పార్థసారథి

16 Aug, 2019 14:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దేవినేని ఉమా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనో పిచ్చోడు అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పార్థసారథి మండి పడ్డారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరుతుండటం పట్ల టీడీపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్థసారథి ఈ విమర్శలపై స్పందించారు. బాబు నివాసం వరదకు మునిగి పోతుందని తాము ఎప్పుడో హెచ్చరించామని.. నేడు అది నిజమయ్యిందని పార్థసారథి తెలిపారు. దీన్ని కప్పిపుచ్చడానికే తెలుగు దేశం నేతలు డ్రామాలాడుతున్నారని పార్థసారథి విమర్శించారు.

చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు వస్తుందనే విషయం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే టీడీపీ నాయకులు డ్రోన్‌ పేరుతో కొత్త రాజకీయాలు చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. తన ఇంట్లోకి నీరు వస్తుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్‌ పారిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాబు.. హైదరాబాద్‌లో దాక్కున్నాడు.. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం అంటూ పార్థసారథి ఎగతాళి చేశారు.

మరిన్ని వార్తలు