‘పవన్‌ కల్యాణ్‌ చర్యతో ప్రజలు నవ్వుకుంటున్నారు’

3 Nov, 2019 17:07 IST|Sakshi

లాంగ్‌ మార్చ్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు

సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్‌ ‘లాంగ్‌ మార్చ్‌’తో ప్రజలు నవ్వుకుంటున్నారని ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ‘లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో 10 వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్‌ కల్యాణ్‌ ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’అని అన్నారు.

మరిన్ని వార్తలు