తొలి ఫలితాల్లో దూసుకుపోతున్న ఫ్యాన్‌

23 May, 2019 08:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ దూకుడుగా ఉంది. పలుచోట్ల తొలి ఫలితాల్లోనే ఫ్యాన్‌ దూసుకుపోతోంది.  లెక్కింపులో వైఎస్సార్‌ పార్టీ  అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అటు పులివెందుల నియోజకవర్గంలో జననేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన హవాను చాటుతున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు  కొనసాగుతోంది. సమస్యాత్మక కౌంటింగ్ కేంద్రాల దగ్గర నిఘా కోసం 14 వేల 770 సీసీ కెమెరాలు, 68 డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు