‘ ఒక్క అవకాశం ఇస్తే రైతురాజ్యం తెస్తాం’

28 Jun, 2018 19:06 IST|Sakshi
దుక్కి దున్నుతున్న ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌

సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బూటకపు మాటలను రైతులు నమ్మే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. గురువారం మంగళగిరిలోని కాజాలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి దుక్కి దున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు రైతులకు చేసిందేమీ లేదన్నారు. రైతులకు సబ్సిడీలు ఇవ్వకూడదని చంద్రబాబు తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్లీ రైతురాజ్యాన్ని తీసుకొస్తారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు