‘పనిగట్టుకుని కొన్ని పత్రికలు గాలి వార్తలు ప్రచారం చేస్తున్నాయి’

25 Feb, 2020 14:20 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేయాల్సింది ప్రజా చైత్యన్య యాత్రలు కాదు.. పశ్చాత్తాప యాత్రలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రామేష్‌ విమర్శించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారాసుని, నరకాసురిని పాలన అంతమై రాజన్న పాలన విరాజిల్లుతుందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నబాబుకు ఏనాడైనా అమ్మఒడి లాంటి పథకం అమలు చేయాలనే ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. రైతు భరోసా వంటి కార్యక్రమాలు అమలు చేసుంటే చంద్రబాబుకుకు ఎందుకంత కడుప మంట అని విమర్శించారు. కావాలనే పని కట్టుకుని కొన్ని ఛానెల్‌లు, పత్రికలు ప్రభుత్వంపై గాలి వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ఎందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగిన నరకాసురుడు చంద్రబాబే అని చెబుతారని ఏద్దేవా చేశారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని జోగి రామేష్‌ అన్నారు.

మరిన్ని వార్తలు