‘ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తా’

31 Aug, 2018 14:05 IST|Sakshi
రాజన్న దొర

ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

సాక్షి, విజయనగరం : విషజ్వరాలపై స్పందించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైఎస్సార్‌సీపీ నేత, సాలూరు ఎమ్యెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారన్నారు. ప్రజలు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మూడు రోజుల్లో  ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు