విదేశాంగ మంత్రిని కలిసిన మిథున్‌రెడ్డి

25 Jun, 2019 16:42 IST|Sakshi

న్యూఢిల్లీ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి మంగళవారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ను కలిశారు. కువైట్‌లో ఆంధ్రప్రదేశ్‌ వాసులు అరెస్టు అయ్యారని, వారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన జైశంకర్‌ను అభ్యర్థించారు. తెలంగాణలోని వరంగల్‌లో 9 నెలల పాపపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆంధ్రవాసులు కువైట్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారని, దీంతో వారిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని మిథున్‌రెడ్డి విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు