‘లోకేశ్‌ను మాలోకం అనేది అందుకే’

16 Jun, 2020 09:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘లోకేశ్ ను మాలోకం అనేది అందుకే. జెసి కుటుంబాన్ని ఓదార్చడానికెళ్లాడా, వీళ్లు తక్కువోళ్లు కాదు, శాస్తి జరిగింది అని తిట్టడానికి వెళ్లాడా? వీడియో క్లిప్పింగ్ చూస్తే ఇదే అనుమానం వస్తుంది. తనను, తండ్రిని కూడా అరెస్టు చేస్తారేమో అని అమాయకత్వం నటించాడు. చేసిన స్కాములు ఒకటా రెండా’ అంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు. అవినీతి కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అరెస్టయిన నేపథ్యంలో జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక మరో ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  (‘ఎర్రన్నాయుడు బాబును ప్రాధేయపడ్డారు’)

>
మరిన్ని వార్తలు