పార్లమెంట్‌ వద్ద వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీల ధర్నా

6 Mar, 2018 11:16 IST|Sakshi
పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీల నిరసన

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు రెండోరోజు కూడా హస్తినలో కొనసాగుతోంది. పార్లమెంట్‌ బయట, లోపల కూడా వైఎస్‌ఆర్‌ సీపీ  పోరాటాన్ని ఉధృతం చేసింది. హోదా అంశంపై చర్చించాలంటూ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద వైఎస్ఆర్‌ సీపీ ఎంపీలు ఈ రోజు ఉదయం ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు