పరిగిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం

26 Jul, 2018 09:09 IST|Sakshi
కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మతిన్‌ 

పరిగి వికారాబాద్‌ : పార్టీ నాయకులు ఎల్లవేళలా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్‌ స్ఫూర్తితో పేదల పక్షాన నిలబడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మతిన్‌ సూచించారు. పరిగిలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో పార్టీ పరిగి నియోజకవర్గ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షాన నిలబడే వారికి గుర్తింపు ఉంటుందని.. వారిని ప్రజలే ఆదరిస్తారని తెలిపారు. ఇది వైఎస్సార్‌ నిరూపించారని గుర్తుచేశారు. నేటికి ఆయన ప్రజల గుండెల్లో ఉండడమే దానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షు డు కోళ్ల యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అహ్మద్‌ ఖాద్రీ, అధికార ప్రతినిధి నరేందర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు