సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్ఎల్పీ సమావేశం ఈ నెల 7వ తేదీన ఉదయం పది గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ శాసనసభాపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.