కడుపులో కాటన్‌ మరిచిపోయారు..

28 Jan, 2018 11:14 IST|Sakshi

సాక్షి, కోవూరు: ఆపరేషన్‌ చేశారు.. పొట్ట లోపల కాటన్‌ మర్చిపోయారు.. తాపీగా కుట్లు వేశారు.. ఇదీ నెల్లూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ రోగి పడిన అవస్థలు వర్ణనాతీతం. వివరాలు ఇలా ఉన్నాయి. వావిళ్లకు చెందిన ఓ మహిళకు నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో గతంలో గర్భసంచి తొలగించే ఆపరేషన్‌ చేశారు. ఆ సమయంలో కడుపులోనే ఉండిపోయిన కాటన్‌ను గమనించకుండా వైద్యులు కుట్లు వేశారు. ఆమెకు కొద్దిరోజులుగా కడుపు నొప్పి తీవ్రంగా వస్తుండడంతో కోవూరు ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు మళ్లీ ఆపరేషన్‌ చేసి ఆమె కడుపులోంచి కాటన్‌ను తొలగించడంతో ప్రస్తుతం కోలుకుంటోంది.

మరిన్ని వార్తలు