72వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

26 Jan, 2018 15:20 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 72వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం సంగటూరు నుంచి ఆయన శనివారం పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిల్లమాను చెన్నైక్రాస్‌, గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ సాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ప్రజాసంకల్పయాత్ర గూడూరు మండలం కాండ్ర నుంచి పునఃప్రారంభం అవుతుంది. వెంకటేశుపల్లి, తిమ్మ సముద్రం క్రాస్‌ వరకూ ఆయన యాత్రను కొనసాగిస్తారు.

మరిన్ని వార్తలు