నెల్లూరు (సెంట్రల్): ‘సార్.. 25 బెడ్లు ఉండే ఆసుపత్రులకూ ఆరోగ్యశ్రీని వర్తింపజేసి మమ్మల్ని ఆదుకోవాలి’ అని ప్రయివేటు ఆసుపత్రుల నిర్వాహకులు డాక్టర్ పెద్దిరెడ్డి, జగదీష్, జ్యోతిరెడ్డి, అనిల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. కలిగిరి వద్ద జననేతను కలసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తే ఎంతో మేలు చేసిన వారవుతారన్నారు. అలాగే, ప్రభుత్వ వైద్యశాలల్లో సీనియర్ రెసిడెన్షియల్స్గా పనిచేస్తున్న వారికి జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. జననేత స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.