సాక్షి, నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 81వ రోజుకి చేరుకుంది. మంగళవారం ఉదయం ఆయన అన్నారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ కు మద్దతుగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ నుంచి సంగం మండలం దువ్వూరు, సిద్ధిపురం, వెంగారెడ్డిపాళెం క్రాస్, గాంధీజన సంఘం, పల్లెపాళెం క్రాస్, పల్లెపాళెంలో జనంతో వైఎస్ జగన్ మమేకం అవతారు. అలాగే సంగంలో పార్టీ జెండాను ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.