అక్టోపస్‌ మాక్‌డ్రిల్‌ లో ప్రమాదం

23 Jan, 2018 14:21 IST|Sakshi

ఐదుగురు సిబ్బందికి తీవ్రగాయాలు

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఆక్టోపస్‌ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగినపుడు ఏ విధంగా రక్షించాలో అన్న అంశాలపై ఆదిభట్ల సమీపంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ క్రమంలో రెండు అక్టోపస్‌ బస్సులు ఢీకొన్నాయి.

దీంతో బస్సులోని ఐదుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సురేష్‌, శేఖర్‌, రఘుపతి, రావు భవాని సింగ్‌, చెన్నకేశవ రెడ్డిగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై మీడియాకు వివరాలు తెలియకుండా ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు