‘అగ్ని దేవునికి కోపం వస్తే.. ఇలానే జరుగుతుంది’

6 Feb, 2019 09:02 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటకలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. మైసూరులోని సుత్తూర్‌ మఠ్‌లో కొన్ని రోజుల క్రితం హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంతవరకూ ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమంలో అనుకోని అపశృతి చోటు చేసుకుంది. హోమగుండాన్ని వెలిగించిన వెంటనే.. ఆ మంటలు కాస్తా అక్కడే ఉన్న బెలూన్‌లను తాకడం.. మంటలు చెలరేగడం వెంటవెంటనే జరిగిపోయింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఏఎన్‌ఐ షేర్‌ చేసిన ఈ వీడయో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ‘అదేమైన పుట్టిన రోజు వేడుక అనుకున్నారా.. బెలూన్లు కట్టారు’.. ‘అగ్ని దేవునికి కోపం వచ్చింది.. అందుకే ఇలా జరిగింది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు