బస్సు పైకి బైక్‌.. నెటిజన్లు ఫిదా

28 Jun, 2020 15:05 IST|Sakshi

ఇంటర్నెట్‌ వాడకం బాగా పెరిగిపోయాక సోషల్‌ మీడియాలో సరదా, సందేశాత్మక వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. కాస్త ఫన్నీగా ఉన్నా సరే ఆ వీడియోలను నెటిజన్లు​ తెగ షేర్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలకు సంబంధించిన వీడియోలను కూడా తెగ లైక్‌ చేస్తున్నారు. తాజాగా జిష్ణు అనే వ్యక్తి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే అది ఎక్కడా, అది ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి తన తలపై బైక్‌ను పెట్టుకొని బస్సు మీదకు ఎక్కించాడు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, తన తలపై పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్‌ చేసుకొని నిచ్చెన సాయంతో బస్సు పైకి ఎక్కి సురక్షితంగా బైక్‌ను దించాడు. దీనికి సంబంధించిన వీడియోను జిష్ణు అనే వ్యక్తి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. ఇక దీనినే బ్యాలెన్సింగ్‌ అంటారని ఓ నెటిజన్‌ పేర్కొనగా.. ఈ వీడియోను జాన్‌ అబ్రహంకు చూపించాలంటూ మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు