కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: 21వ వార్షిక వైఎంసీఏ కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ ఫెస్టివల్ బాస్కెట్బాల్ విభాగంలో లిటిల్ ఫ్లవర్ జట్లు శుభారంభం చేశాయి. సీనియర్, జూనియర్ విభాగాల్లో తమ ప్రత్యర్థి జట్లపై విజయాలను నమోదు చేశాయి. శనివారం జరిగిన సీనియర్ బాలుర విభాగంలో లిటిల్ ఫ్లవర్ (ఆబిడ్స్) జట్టు 20–17తో స్లేట్పై విజయం సాధించింది. మరో మ్యాచ్లో ఆల్ సెయింట్స్ జట్టు 17–10తో సెయింట్ పాల్స్ను ఓడించింది. జూనియర్ విభాగంలో లిటిల్ ఫ్లవర్ (ఉప్పల్) 15–6తో స్లేట్పై గెలుపొందగా,సెయింట్ పాల్స్ 14–8తో లిటిల్ ఫ్లవర్ (ఆబిడ్స్)పై విజయం సాధించింది.
కబడ్డీలో స్లేట్ ద స్కూల్ విజయం
బాలుర అండర్ –14 కబడ్డీ మ్యాచ్లో స్లేట్ (కర్మన్ఘాట్) 40–15తో గీతాంజలి స్కూల్పై ఘన విజయం సాధించింది. అండర్–17 విభా గంలో మంచి స్కూల్ (బాలాపూర్) 36–12తో స్లేట్(ఆబిడ్స్)పై, స్లేట్ (అమీర్పేట) 15–6తో శాంతినికేతన్పై, సీఆర్పీఎఫ్ (హకీంపేట) 21–15తో స్లేట్ (అమీర్పేట)పై విజయాలు సాధించాయి. టోర్నీ ఆరంభ వేడుకలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.