మూడో టెస్టు: టీ విరామానికి ఆసీస్ 174/4

29 Dec, 2014 11:02 IST|Sakshi

మెల్బోర్న్: భారత్తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ మరోసారి విజృంభించి రోజర్స్ (69)ను బౌల్డ్ చేశాడు. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం టీ విరామానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. వార్నర్, వాట్సన్, స్మిత్ అవుటయ్యారు. మార్ష్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లు అశ్విన్ రెండు, ఇషాంత్,  ఉమేష్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతానికి ఆసీస్ ఓవరాల్గా 239 పరుగుల ఆధిక్యం సాధించింది.

మరిన్ని వార్తలు