మూడో టెస్టు: రాణిస్తున్న భారత బౌలర్లు

29 Dec, 2014 12:17 IST|Sakshi
మూడో టెస్టు: రాణిస్తున్న భారత బౌలర్లు

మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత బౌలర్లు రాణిస్తున్నారు. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం రెండో సెషన్లో మూడు వికెట్లు తీసిన భారత్.. టీ విరామం తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టింది. తాజాగా ఉమేష్ యాదవ్.. బ్రాడ్ హాడిన్ను పెవిలియన్ బాటపట్టించాడు. హాడిన్ వికెట్ల వెనుక ధోనీకి దొరికిపోయాడు. అంతకుముందు ఆసీస్ బ్యాట్స్మన్ బర్న్స్ (9) కూడా ఇషాంత్ బౌలింగ్లో ధోనీకి క్యాచిచ్చాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.  భారత బౌలర్లు అశ్విన్, ఇషాంత్, ఉమేష్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వార్తలు