50 మీ. విజేత వైష్ణవి

31 May, 2014 00:38 IST|Sakshi

డీఎస్‌ఏ సమ్మర్ అథ్లెటిక్స్ మీట్
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హెచ్‌డీఎస్‌ఏ సమ్మర్ అథ్లెటిక్స్ మీట్‌లో 50 మీటర్ల పరుగు పందెంలో వైష్ణవి స్వర్ణం గెలుచుకుంది. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (హెచ్‌డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఈ మీట్ జింఖానా మైదానంలో శుక్రవారం జరిగింది. ఈ పోటీల విజేతలకు హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ రాజేష్ కుమార్, డీఎస్‌ఏ అధికారి అలీమ్ ఖాన్ పతకాలను అందజేశారు.
 
 ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 బాలికల విభాగం: 50 మీ:1. కె.వైష్ణవి, 2.కవిత, 3.మోనిక, శ్రుతి. అండర్-10 బాలుర విభాగం: 50 మీ: 1.హర్షవర్ధన్, 2.హర్ష వర్మ, 3.యశ్వంత్. లాంగ్‌జంప్: 1.యశ్వంత్, 2.అరుణ్ కుమార్, 3.హర్షవర్ధన్. 100 మీ: 1.పి.కేశవ్, 2.సి.వంశీకృష్ణ, 3.ఆదిత్య. పురుషుల: 100 మీ: 1.ప్రతీక్, 2.శేఖర్, 3.దినేష్. 800 మీ: 1.శేఖర్, 2.బాలాజీ, 3.కేశవ్. లాంగ్‌జంప్: 1.లవుడు, 2.అజిత్, 3.అజిత్.
 

మరిన్ని వార్తలు