కోహ్లీ హాఫ్ సెంచరీ, రాణించిన రాయుడు

16 Nov, 2014 19:04 IST|Sakshi

రాంచీ: శ్రీలంకతో ఐదో వన్డేలో భారత్ లక్ష్యం దిశగా సాగుతోంది. ఓపెనర్లు ఆరంభంలోనే అవుటయినా విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు బాధ్యతాయుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న చివరి మ్యాచ్లో భారత్ 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది.  భారత్ 19 ఓవర్లలో రెండు వికెట్లకు 97 పరుగులు చేసింది. కోహ్లీ, రాయుడు బ్యాటింగ్ చేస్తున్నారు.

కాగా భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రహానె (2), రోహిత్ (9) తక్కువ పరుగులకే అవుటయ్యారు. మాథ్యూస్ వీరిద్దరినీ వరుస ఓవర్లలో బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. విరాట్, రాయుడు కాసేపు సంయమనంగా ఆడారు. క్రీజులో నిలదొక్కుకున్నాక ఈ జోడీ దూకుడు పెంచింది.

>
మరిన్ని వార్తలు